22 నుంచి ప్రైవేటు స్కూళ్లలో పేదల ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు

అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం 2023-24 విద్యా సంవ త్సరానికి గాను పేద వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది. 

ఇందుకోసం ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ సూచించింది. 

ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న స్కూళ్లు ఈనెల 19లోగా తమ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని ఆదేశించింది. 

విద్యార్థుల తల్లిదండ్రులు 22వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. 

ఏప్రిల్ 13 నుంచి 17 వరకు అర్హులను ఎంపిక చేసి.. ఏప్రిల్ 18న మొదటి రౌండ్ ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 19 నుంచి 25 వరకు ఆయా స్కూళ్లు వీరికి ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 29న రెండో విడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు. 

వీరికి మే 1 నుంచి మే 5 వరకు ప్రవేశాలు కల్పించాలి.

Leave a Comment